చంద్రబాబు కొత్త వాదన తెస్తున్నారు…

by  |
Minister Botsa Satyanarayana
X

దిశ వెబ్ డెస్క్ :
మతం అజెండాగా బీజేపీ పనిచేస్తే…కులం అజెండాగా చంద్రబాబు పనిచేస్తున్నారనీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టే చంద్రబాబు ఇప్పుడు కొత్త వాదన తెస్తున్నారని ఆయన తెలిపారు. కక్ష తీర్చుకోవాలనే రాక్షస స్వభావం చంద్రబాబుది మాత్రమేనని తమది కాదనీ ఆయన అన్నారు. కక్ష తీర్చుకోవాలంటే చంద్రబాబునే టార్గెట్ చేస్తాం కానీ, వేరే వాళ్ల జోలికి ఎందుకు వెళతామని ఆయన అన్నారు. ఎవరిపైనా కక్ష తీర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. గంటకొక్కటి మాట్లాడే రఘురామరాజు వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం తమకు లేదని ఆయన చెప్పారు. దేవాలయాల దాడులు, చోరీల వెనుక ఎవరున్నా పట్టుకుని శిక్షిస్తామని ఆయన తెలిపారు.



Next Story

Most Viewed