బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్

by  |
బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్
X

దిశ, బోధన్: బోధన్ పట్టణంలోని బోనాల పండుగను అరెకటిక కులస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని, ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని, అదే విధంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని బోధన్ వాసులు అమ్మవారిని కోరుకున్నట్లు వివరించారు. బోనాల పండుగలో రాజు లాల్, గంగారాం, మహేష్, రాజేంద్ర, విట్ఠల్, లాలూ, సాయినాథ్, రాజేశ్వర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story