కర్నూల్‌లో రక్తపాతం.. ఇరువర్గాల దాడిలో..

by srinivas |
కర్నూల్‌లో రక్తపాతం.. ఇరువర్గాల దాడిలో..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లాలో మరోసారి రక్తపాతం జరిగింది. ఇరువర్గాలు దాడిలో రక్తం ఏరులైపారింది. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని మహానంది మండలం గోపవరం గ్రామంలో స్థల వివాదం చేలరేగింది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి మట్టి తీసే పార తీసుకుని దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిలో ఓ వ్యక్తి తలకు పార బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది.

తోటి వ్యక్తులు దాడి చేసే వ్యక్తిని ఆపేందుకు ఎంత ప్రయత్నించిన వివాదం సర్దుమణగలేదు. గాయపడిన వ్యక్తిన వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితులను కంట్రోల్‌లోకి తెచ్చారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వర్గంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story