కేసీఆర్ ప్రజల రక్తం తాగుతున్నారు : రాజాసింగ్

by  |
కేసీఆర్ ప్రజల రక్తం తాగుతున్నారు : రాజాసింగ్
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రజల రక్తం తాగుతున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పార్టీ కార్యకర్తలు అహర్నిశలు సైనికుల్లా పని చేసి బీజేపీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు తలుచుకుంటే దుబ్బాకలో బీజేపీ గెలుపు ఖాయమని రాజాసింగ్ ధీమా వ్యక్తంచేశారు. దుబ్బాక ఎన్నికల్లో అధికారపార్టీ డబ్బులు పంచితే తీసుకుని, బీజేపీకి ఓటేయాలని కోరారు.

బీజేపీ దగ్గర డబ్బులు లేవని కానీ, జనబలం ఉందన్నారు. టీఆర్ఎస్ ఓడిపోతే పెన్షన్లు రావని స్వయాన మంత్రి ప్రచారం చేయడం మంచిది కాదని.. పెన్షన్లు ఆపే దమ్ము ఏ పార్టీకి లేదని రాజాసింగ్ హెచ్చరించారు.


Next Story

Most Viewed