బీజేపీ కార్పొరేటర్ టీఆర్ఎస్ లో చేరిక..!

by  |
బీజేపీ కార్పొరేటర్ టీఆర్ఎస్ లో చేరిక..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపాలిటీకి చెందిన బీజేపీ కార్పొరేటర్ టీఆర్ఎస్‎లో చేరారు. బుధవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన 6వ డివిజన్ కార్పొరేటర్ ఉమారాణి ఆమె భర్త తడ్కల్ శ్రీనివాస్ టీఆర్ఎస్‎లో చేరారు. దీంతో వారిద్దరిని వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్టు ఉమారాణి తెలిపారు. కాగా, ఇప్పటివరకు ఐదుగురు బీజేపీ కార్పరేటర్‎లు పార్టీని వీడారు.


Next Story

Most Viewed