విద్యుత్ బిల్లుల భారాన్ని ప్రభుత్వమే భరించాలి

by  |
విద్యుత్ బిల్లుల భారాన్ని ప్రభుత్వమే భరించాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: సామాన్యులపై మోపిన విద్యుత్ బిల్లుల భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళనకు పిలుపు నిచ్చింది. సోమవారం విద్యుత్ సౌధ ఎదుట నిర్వహించే ఆందోళనలో తనతో పాటు రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. జిల్లాల్లో జరిగే ధర్నాల్లో జిల్లా అధ్యక్షుడు, కోర్ కమిటీ సభ్యులు పాల్గొంటారని పేర్కొన్నారు. లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూ శాంతియుతంగా నిరసన తెలపనున్నట్లు వెల్లడించారు. టెక్నికల్ అంశాలు, స్లాబ్‌లను సాకులుగా చూపుతూ ప్రభుత్వం జనం జేబులకు చిల్లు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక బిల్లుల రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ఆందోళనలు చేస్తామని సంజయ్ స్పష్టం చేవారు.


Next Story

Most Viewed