దేవంపల్లి వద్ద బైక్, లారీ ఢీ..!

by  |
దేవంపల్లి వద్ద బైక్, లారీ ఢీ..!
X

దిశ, మానకొండూరు:

కరీంనగర్ జిల్లా దేవంపల్లి సోషల్ వెల్ఫేర్ స్కూల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైకును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పచ్చూనూర్ గ్రామానికి చెందిన గాజు సంపత్‎గా గుర్తించారు. మృతుడు కరీంనగర్ నుంచి ఫెర్టిలైజర్‎లో మందులు తీసుకుని స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు బంధువులు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బలగాలు.. రెండు గంటల పాటు శ్రమించి ట్రాఫిక్‎ను క్లియర్ చేశారు. ఘటనాస్థలిని ఏసీపీ విజయసారథి పరిశీలించారు.


Next Story