భానుమతిని ‘ఆహా’ అనిపించిన మంత్రి

by  |
భానుమతిని ‘ఆహా’ అనిపించిన మంత్రి
X

దిశ, కంటోన్మెంట్: కరోనా మహమ్మారి సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం వెస్ట్ మారేడ్‌పల్లి‌లోని తన నివాసంలో భానుమతి అండ్ రామకృష్ణ చిత్రాన్ని ఆహా యాప్ ద్వారా మంత్రి శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. షూటింగులు పూర్తి చేసుకున్న చిత్రాలు విడుదల చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, చిత్ర దర్శకుడు శ్రీకాంత్ నాగోతి, నిర్మాత యశ్వంత్, హీరో నవీన్ చంద్ర, శరత్ మరార్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed