ఆ పథకం ప్రచార ఖర్చు రూ.393కోట్లు

by  |
ఆ పథకం ప్రచార ఖర్చు రూ.393కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్ :

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘భేటి బచావో, భేటి పడావో’ పథకం కోసం ఇప్పటివరకు రూ.393కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2014-2020వరకు ఈ నిధులను వినియోగించినట్లు తెలిపింది.

రాజ్యసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది. లింగ వివక్ష నిర్మూలన, ఆడపిల్లల మనుగడ మరియు రక్షణ కల్పించడం, బాలికలకు విద్య అందేలా చూడటం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.


Next Story