బీజేపీ నిరంకుశ ధోరణి సరైంది కాదు

by  |
బీజేపీ నిరంకుశ ధోరణి సరైంది కాదు
X

దిశ, ప్రతినిధి, మహబూబ్‌నగర్: కేంద్ర ప్రభుత్వం తమ నిరంకుశ ధోరణి విడనాడాలనీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీజే. బెనహర్ అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీ కార్యాలయంలో స్పీక్ ఫర్ డెమాక్రసీనీ నిర్వహించారు. ఈ సందర్భంగా బెనహర్ మాట్లాడుతూ… బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తోందన్నారు. రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుభాష్ కత్రీ, షబ్బీర్, అలీ తదితరులు పాల్గొన్నారు.


Next Story