లెక్చరర్లకు ‘ డిజిటల్​ దిశ’ శిక్షణ ప్రారంభం

by  |
లెక్చరర్లకు ‘ డిజిటల్​ దిశ’ శిక్షణ ప్రారంభం
X

దిశ, న్యూస్​బ్యూరో: జూనియర్​ కళాశాలల లెక్చరర్లకు నైపుణ్య శిక్షణకు ఉద్దేశించిన ‘డిజిటల్​ దిశ’ మంగళవారం ప్రారంభమయింది. 12బ్యాచ్​ల్లో 5,300 మంది లెక్చరర్లకు డిజిటల్ బోధన పద్ధతులు, టెక్నాలజీ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్​ బోర్డు కమిషనర్​ సయ్యద్​ ఒమర్​ జలీల్​.. సీఎస్​‌ఆర్, నిర్మాణ్​ ఎన్జీఓకు ధన్యవాదాలు తెలిపారు. జూనియర్​ లెక్చరర్లకు డిజిటల్​ పాఠ్యాంశాల్లో శిక్షణ అందడంతో పాటు లక్షల సంఖ్యలో విద్యార్థుల భవిష్యత్​ను ప్రభావితం చేయనుందన్నారు. ప్రైవేటు జూనియర్​ కళాశాలల లెక్చరర్లు కూడా ఇలాంటి శిక్షణ తీసుకోవాలని సూచించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్​ డైరెక్టర్​ అబ్దుల్​ వహీద్​, కాగ్నిజెంట్​ టెక్నాలజీ వైస్​ ప్రెసిడెంట్​ జితేంద్ర మయూర్​, శివ, స్వరూప పాల్గొన్నారు.


Next Story

Most Viewed