శవాన్ని వదిలేసి పరుగో పరుగు

by Anukaran |
శవాన్ని వదిలేసి పరుగో పరుగు
X

దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో తేనెటీగలు కలకలం సృష్టించాయి. అంతిమ యాత్రలో పాల్గొన్నవారిపై దాడి చేశాయి. దీంతో శవాన్ని వదిలేసి బావిలో దూకి తలదాచుకున్నారు. ఓదెల మండలం శానాగొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొడపాక దేవక్క అనే మహిళ శనివారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. శవాన్ని ఖననం చేసేందుకు తీసుకెళ్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో అంతిమ యాత్రలో పాల్గొన్న వారు శవాన్ని వదిలేసి పరుగులు తీసి బావిలో దూకారు. తేనెటీగల దాడిలో 15 మంది గాయపడ్డారు. వీరందరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.



Next Story

Most Viewed