- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
శవాన్ని వదిలేసి పరుగో పరుగు

X
దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో తేనెటీగలు కలకలం సృష్టించాయి. అంతిమ యాత్రలో పాల్గొన్నవారిపై దాడి చేశాయి. దీంతో శవాన్ని వదిలేసి బావిలో దూకి తలదాచుకున్నారు. ఓదెల మండలం శానాగొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొడపాక దేవక్క అనే మహిళ శనివారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. శవాన్ని ఖననం చేసేందుకు తీసుకెళ్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో అంతిమ యాత్రలో పాల్గొన్న వారు శవాన్ని వదిలేసి పరుగులు తీసి బావిలో దూకారు. తేనెటీగల దాడిలో 15 మంది గాయపడ్డారు. వీరందరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
Next Story