వృద్ధులను ఆదరించండి : నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు

by  |
వృద్ధులను ఆదరించండి : నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు
X

దిశ, ఆదిలాబాద్

వృద్ధులను ప్రతి ఒక్కరూ ఆదరించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు కోరారు. జిల్లా కేంద్రంలోని సోమవారంపేట్‌లో ఉన్న వృద్ధాశ్రమాన్ని ఆయన శనివారం సందర్శించారు. డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి సౌజన్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరూ వృద్ధాప్యానికి రాక తప్పదు. కుటుంబంతో కలిసి ఉండాలని అందరికీ ఉంటుంది. కాబట్టి, అత్తమామలను, తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పించడం మంచి పద్ధతి కాదు. వృద్ధాశ్రమ వ్యవస్థ భారతీయ సంస్కృతికి వ్యతిరేకం. అందుకే ఆ వ్యవస్థకు స్వస్తి పలికి కుటుంబసభ్యులు వృద్ధులకు అండగా నిలవాలి. పిల్లల భవిష్యత్తు కోసం చెమటంతా ధారపోసి కష్టపడి ప్రయోజకులను చేసిన తర్వాత వారిని పిల్లలు పట్టించుకోకపోవడం బాధ కలిగిస్తోంది. అయితే, కరోనా వైరస్ జీవన శైలిలో మార్పులు తీసుకువచ్చింది. ప్రస్తుతం పబ్బులు, పార్కులు అన్ని మూతపడ్డాయి. గత కొద్ది రోజులుగా ప్రజలు కుటుంబ సభ్యులతో గడపడం వల్ల మమతానురాగాలు పెంపొందుతున్నాయి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవం అందుకే వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి’ అని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాస్ రావు, వెంకట్ రెడ్డి, నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed