వివోతో ఒప్పందం రద్దు: బీసీసీఐ అధికారిక ప్రకటన

by  |
వివోతో ఒప్పందం రద్దు: బీసీసీఐ అధికారిక ప్రకటన
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి చైనా మొబైల్ కంపెనీ వివో తప్పుకున్నట్లు బీసీసీఐ గురువారం అధికారికంగా ప్రకటించింది. ‘ఐపీఎల్‌-2020తో భాగస్వామ్యం రద్దు చేసుకొనేందుకు బీసీసీఐ, వివో మొబైల్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ నిర్ణయించాయి’ అని బీసీసీఐ ఏక వాక్యంతో తేల్చేసింది. ఈ మేరకు మెయిల్ ద్వారా మీడియాకు వెల్లడించింది. అయితే, ఈ ఒప్పందం రద్దు ఈ ఏడాదికేనా లేదా మొత్తానికా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. వివో తప్పుకోవడంతో బీసీసీఐ మరో స్పాన్సర్‌ను వెతుక్కునే పనిలో పడింది.


Next Story

Most Viewed