- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: కరోనాతో మరణించిన వారి మృతదేహాల ఖననానికి అధికారులు కర్ణాటక ప్రభుత్వం ఏకంగా 35 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ రాష్ట్రంలో కరోనా మృతుల అంత్యక్రియలకు స్థానికులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు.ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. మృతదేహాలు తరలించే సిబ్బంది, అంబులెన్స్లపై స్థానికులు దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కరోనా మృతదేహాల పట్ల సిబ్బంది సరిగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల బళ్లారి దవాఖానలో కరోనాతో చనిపోయిన 8 మంది మృతదేహాలను ఒకే బ్యాగులో ఉంచిన సిబ్బంది వాటిని ఓ గోతిలోకి విసిరేశారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బీ శ్రీరాములు ఈ అంశంపై స్పందించారు. కరోనాతో చనిపోయినవారి మృతదేహాల ఖననానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ అశోక్తో ఈ విషయాన్ని చర్చించారు. ఉత్తర, దక్షిణ బెంగళూరు, అనెకల్, యలహంక తాలూకాల పరిధిలోని 9 గ్రామాల్లో సుమారు 35.5 ఎకరాలను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో బెంగళూరు అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ జీఎన్ శివమూర్తి ఈ మేరకు స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనాతో చనిపోయినవారి మృతదేహాల ఖననానికి ఇంత పెద్ద స్థలం కేటాయించడం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.