సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సూటి ప్రశ్న

by  |
సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సూటి ప్రశ్న
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు. గణేశ్ నవ రాత్రులకు పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం.. పాతబస్తీలో మొహర్రం పండగ సందర్భంగా జరిగిన ర్యాలీపై ఏం సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. పాతబస్తీలో పోలీసులే దగ్గరుండి వేల మందితో ర్యాలీ నిర్వహించారని, హిందూవులు గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. హోంమంత్రి ఎంఐఎం ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కార్ ఒక వర్గానికే కొమ్ము కాసేలా వ్యవహరిస్తుందని విమర్శలు చేశారు.



Next Story

Most Viewed