- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విద్యార్థులపై ఉన్న కేసులు వారిపై లేవు..!

X
దిశ, హుస్నాబాద్:
తెలంగాణ ఉద్యమంలో పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులపై ఉన్న కేసులు.. ఏ ఒక్కటి కూడా కేసీఆర్ కుటుంబంపై లేవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మంగళవారం బైరాన్పల్లి మృతవీరులకు బండి సంజయ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ వెంకటస్వామి, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నిజాం అరాచకాలు, నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు బైరాన్పల్లి నాడు రణరంగమైందని అన్నారు. రాష్ట్ర సాధనకు అదే స్ఫూర్తితో యువత ముందుకు సాగిందన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటే కేసీఆర్ కుటుంబం నేడు రాజభోగాలు అనుభవిస్తుందని బండి సంజయ్ విమర్శించారు. సీఎం కేసీఆర్కు ఓట్లు, సీట్ల రాజకీయంపై ఉన్న ఆలోచన రాష్ట్ర ప్రజలపై లేదని మండిపడ్డారు.
Next Story