చైనాకు భారత్ షాక్

by  |
చైనాకు భారత్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో చైనా యాప్స్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టిక్‌ టాక్ సహా 59 యాప్‌లను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. ఈనెల 15న గాల్వన్ లోయలో భారత్, చైనా సరిహద్దు వద్ద ఘర్షణలో మన సైనికులు 21మంది వీరమరణం పొందారు. అప్పటి నుంచి ఇరుదేశాల సరిహద్దు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో దేశ భద్రత, రక్షణ దృష్ట్యా చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్లు కేంద్రం ప్రకటన చేసింది.

బ్యాన్ అయిన చైనా యాప్‌లు:

టిక్‌ టాక్, షేర్ ఇట్, హలో యాప్, క్యూ క్యూ ప్లేయర్, న్యూ వీడియో స్టేటస్, యూసీ బ్రౌజర్, ఎంఐ కమ్యూనిటీ, ఎంఐ వీడియోకాల్, వీచాట్, బ్యూటీ ప్లస్, డీవీ క్లీనర్ సహా పలు యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది.


Next Story

Most Viewed