మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం..

by  |
మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం..
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ, దాని కార్యకలాపాలపై ఇదివరకు విధించిన నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సంవత్సరం ఆగస్టు 17నుంచి నిషేధం అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏపీ భద్రతా చట్టం ప్రకారం నిషేధం పొడిగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదేవిధంగా మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ పైనా కూడా మరో ఏడాది పాటు ప్రభుత్వం నిషేధం విధించింది.

Read Also…

రెవె‘న్యూ’ బిల్లుపై అసెంబ్లీలో చర్చ..


Next Story