ఆ 9 గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయ్

by  |
ఆ 9 గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయ్
X

దిశ, చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని ఎర్రగుంటపల్లి వద్ద రూ. 8 కోట్ల 23 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన రోడ్డు నిర్మాణానికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోడ్డు గంగారం నుండి పొన్నారం వయా బీరవెల్లి, నాగపూర్ వరకు నిర్మించబడుతుందని, దీని ద్వారా 9 గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు రవాణా కష్టాలు తీరుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మోతి తిరుపతి, మండల పరిషత్ అధ్యక్షులు మంత్రి బాపు, వివిధ గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed