కాళహస్తి ఆలయంలో అపచారం….

by  |
కాళహస్తి ఆలయంలో అపచారం….
X

దిశ వెబ్ డెస్క్:
ప్రముఖ శ్రీ కాళ హస్తి దేవాలయంలో అపచారం చోటు చేసుకుంది. ఆలయంలో కాశీ లింగం, రామేశ్వర లింగం పక్కనే లింగం, నంది విగ్రహాలను ప్రతిష్ఠాపన చేశారు. కాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో వాటిని అధికారులు తొలగించారు. వెంటనే సంప్రోక్షణ చేయించారు. శివలింగం, నంది ప్రతిమలను ఎలా ప్రతిష్టించారో తెలియదనీ, తప్పు జరిగిందని ఆలయ పండితులు గురుకుల్ స్వామి నాథన్ వెల్లడించారు. కాగా విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు నిరసనకు దిగారు. హిందువుల మనోభావాలను కాపాడాలంటూ వారు నిరసన వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed