రాజధాని ఎక్కడో తెలియదు : చంద్రబాబు

by  |
రాజధాని ఎక్కడో తెలియదు : చంద్రబాబు
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి అజరామరమైనదని దానికి చావు లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాజధాని కోసం విజయవాడలో పోరాటం చేస్తోన్న రైతుల దీక్షకు మద్దతు తెలిపిన సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 29 వేల మంది రైతులు 34 ఎకరాల భూమిని త్యాగం చేశారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఈ గొప్ప పనిని చేశారని కీర్తించారు. రైతులను భాగస్వాములను చేస్తూ ల్యాండ్‌ పూలింగ్‌కు నాంది పలికామని గుర్తు చేశారు. రాజధాని వస్తే తాము కూడా బాగుపడతామని వారు కలలు కన్నారని అన్నారు. దీంతో ఎన్నో సంస్థలు అమరావతికి వచ్చాయని తెలిపారు. వీటి వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేదని వెల్లడించారు. ఎన్నో ఉద్యోగాలు కూడా వచ్చేవని ఆయన చెప్పారు.

దేవేంద్రుడు స్వర్గలోకానికి రాజైతే దాని రాజధాని అమరావతి అని, అంటే అజరామరమైనది చెప్పారు. అందుకే అమరావతికి చావు లేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా చంపాలని అనుకున్నా, అమరావతిని దెబ్బతీయాలనుకున్నా వారి ప్రయత్నాలు ఫలించవని తెలిపారు. అమరావతికి చరిత్ర ఉందని, ఆ నగరం ప్రాచీన నాగరికతకు చిహ్నం అని, శాతవాహనుల రాజధాని అని గుర్తు చేశారు.

‘అమరావతి కోసం పోరాడుతున్న అందరికీ అభినందనలు. అమరావతి ఉద్యమానికి అల్లూరి సీతారామ రాజు మనకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులులర్పించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు చాలా సమస్యలు వచ్చాయి. రాజధాని ఎక్కడో తెలియదు. ఆదాయం లేదు, ఉద్యోగాలు లేవు.. ఈ రాష్ట్రానికి మంచి సిటీ కూడా లేని పరిస్థితి. తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్‌ వున్నాయి. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్‌కు గొప్ప రాజధాని ఉండాలని కోరుకున్నాం. అదే మనం చేసిన తప్పా? అని నేను అడుగుతున్నాను. ఏ ఒక్క రాజకీయ పార్టీ కోసమో కాదు ఈ రాజధాని. రాజధాని 13 జిల్లాలకు నడిబొడ్డున నిర్మించాలని అనుకున్నామ’ని అని చంద్రబాబు తెలిపారు.

అమరావతి కోసం పోరాడుతున్న వారిని ఎన్నో రకాలుగా హింసించారు. మీడియాలో దీనిపై రాస్తే వారినీ ఇబ్బందులకు గురి చేశారు. చాలా మంది గుండె ఆగి చనిపోయారు. ఎప్పుడు పోలీసులు వస్తారోననుకుంటూ భయపడుతూ జీవించారుని చెప్పారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ఆయన అడుగుతున్నాను. అయినప్పటికీ, ఉద్యమకారులు చూపిన చొరవ అభినందనీయం. రాజధాని మార్చుతామని ప్రభుత్వం చెబుతోంది. విశాఖపట్నంలో కబ్జాలకు పాల్పడుతున్నారు’ అని‌ఆయన ఆరోపించారు.


Next Story

Most Viewed