అమ్మనాన్నను ఎన్‌కౌంటర్ చేయండి !

by  |
అమ్మనాన్నను ఎన్‌కౌంటర్ చేయండి !
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హేమంత్‌ హత్య కేసులో మా అమ్మనాన్న, మావయ్యలను ఎన్‌కౌంటర్ చేయాలని అవంతి డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, జగన్‌ సార్.. మీరంతా నాతో ఉండి న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేశారు. హేమంత్‌ తండ్రి మురళీకృష్ణకు మా బంధువు గూడురు సందీప్‌రెడ్డి పలుమార్లు ఫోన్ చేసి బెదిరించారని, హేమంత్ హత్యకేసులో సందీప్‌రెడ్డి పాత్ర చాలా కీలకమైందని అవంతి తెలిపారు. మా సోదరుడు అశిశ్‌రెడ్డికి హత్యతో డైరెక్ట్‌గా సంబంధాలు లేకున్నా బయట నుంచి మా తల్లిదండ్రులు, మావయ్య సహకరించారని ఆరోపించారు. సందీప్‌రెడ్డి నుంచి తమకు ప్రాణహానీ ఉందని అవంతి పేర్కొన్నారు.

తనకు హేమంత్‌తో 8 ఏళ్ల నుంచి పరిచయం ఉందని… ఇంటర్‌ చదివే సమయంలో అతనికి దూరంగా ఉండాలని మా నాన్న చెప్పారని అవంతి అన్నారు. గతేడాది నవంబర్‌ 27ఇంట్లో తెలియడంతో సుమారు 8నెలలు ఇంట్లో నిర్బంధించారని, దీంతో జూన్ 9న ఇంటి నుంచి వచ్చి బీహెచ్ఈఎల్‌లోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నామన్నారు. నాకు ఇప్పుడు అమ్మనాన్న హేమంత్ తల్లిదండ్రులేనని, నా మరిదే నాకు సోదురుడి లాంటివాడని కన్నీంటి అవంతి పర్యాంతమైంది.

హేమంత్ తల్లి.. అవంతి తల్లి ఫ్రెండ్స్ !

ఇదిలా ఉండగా హేమంత్‌ తల్లి లక్ష్మీరాణి, అవంతి తల్లి అర్చనారెడ్డి ఇద్దరు ఫ్రెండ్స్‌ అని తెలుస్తోంది. అవంతి వాళ్ల ఇంట్లో ఏ కార్యానికైనా హేమంత్ తల్లి లక్ష్మీరాణి వెళ్లేదని సమాచారం. అవంతి తల్లి అర్చనకు బ్యూటిషియన్‌గా తరుచూ వాళ్ల ఇంటికి వెళ్తున్న క్రమంలో హేమంత్ తల్లి లక్ష్మీరాణికి అవంతి క్లోజ్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయం పోలీసుల విచారణలో వెల్లడైనట్టుగా సమాచారం.



Next Story

Most Viewed