- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వారి అభిప్రాయాలు తెలుసుకోండి
by Shyam |
దిశ ప్రతినిధి, నిజామాబాద్:
కోవిడ్-19 కారణంగా ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు పున:ప్రారంభం కాలేదు. కాబట్టి ప్రారంభం కోసం ప్రతి పాఠశాలలోని అందరి విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించాలని నిజామాబాద్ జిల్లా విద్యా శాఖాధికారి జనార్ధన్ రావు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ , ప్రైవేట్ ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలు ఏ మాసంలో పునర్ ప్రారంభం కావాలి అని అభిప్రాయాలను సేకరించాలని కోరారు. పాఠశాలలు పునర్ ప్రారంభం అయిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల్లో విద్యా బోధన, వైరస్ నుంచి రక్షణకు ఏ విధమైన చర్యలను కోరుతున్నారు అనే అంశాలపై అభిప్రాయాలను సేకరించాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖాధికారి ద్వారా డీఈఓ కార్యాలయానికి ఈ నెల 25 వరకు పంపాలని కోరారు.
Next Story