కృష్ణమ్మ పరవళ్లు… 43 గేట్ల ఎత్తివేత

by  |
కృష్ణమ్మ పరవళ్లు… 43 గేట్ల ఎత్తివేత
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. 2009 తరువాత తిరిగి ఈ సారి ఈ స్థాయిలో కృష్ణమ్మ ప్రవహిస్తుంది. ఈ క్రమంలో వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో జూరాలకు 4,17,770 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 4,17,253 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతికి అధికారులు నది పరివాహక ప్రజలు అప్రమత్తం చేశారు. అలగే వరదనీరు పోటెత్తడంతో జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి పుణ్యక్షేత్రం దగ్గర పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. వరద నీరు రామాలయం సమీపం వరకు చేరుకోవడంతో నదివైపు ప్రజలను అనుమతించడంలేదు.


Next Story