ప్రభుత్వ అండతోనే దాడులు: చంద్రబాబు

by  |
TDP
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ నేతలతో ఆదివారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులపై దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని అన్నారు. తొలిసారి ఇలాంటి దాడులు జరిగినప్పుడే కఠినంగా శిక్షిస్తే మరోసారి జరిగేవి కావని పేర్కొన్నారు. ఉన్మాదుల పాలన ఎలా ఉంటుందో అనడానికి దళితులపై దాడులే నిదర్శనమన్నారు. ప్రభుత్వ అండతోనే నేరగాళ్లు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. దళితులపై దాడులను ప్రజా సంఘాలు ఖండించాలని చంద్రబాబు కోరారు.


Next Story

Most Viewed