వృద్ధ దంపతులపై దాడి.. ఒకరు మృతి

by  |

అమరావతి: కృష్ణా జిల్లా నందిగామ మండలం కేతవీరునిపల్లిలో శ్రీనివాస రావు అనే వ్యక్తి వృద్ధ దంపతులపై దాడి చేశాడు. ఈ దాడిలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు తెలియరాలేదనీ, విచారణ చేపట్టినట్టు వెల్లడించారు.

Tags: Attack, elderly couple, One man killed, krishna dist


Next Story

Most Viewed