- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కరోనా విలాయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. . గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,555 మందికి కరోనా సోకిన విషయం ఓవైపు కలవర పెడుతుంటే.. ఇదే సమయంలో విశాఖ స్టేట్ కొవిడ్ హాస్పిటల్లో జరిగిన ఓ దారుణం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
విశాఖ స్టేట్ కొవిడ్ ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. విమ్స్ హాస్పిటల్లో కరోనా పేషంట్ల పరిస్థితి దారుణంగా తయారైంది. క్రమంగా మృతుల సంఖ్య పెరుగుతుండడంతో బాధితుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. నేలపై ఓ మహిళ పడి ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. బాధితురాలు కాపాడండి అంటూ అరుస్తున్న ఏ ఒక్క సిబ్బంది కూడా స్పందించకపోవడం గమనార్హం. అయితే, హాస్పిటల్లో నేలపైనే పేషంట్లు అవస్థలు పడుతున్నారని ఓ యువకుడు వీడియో తీసి షేర్ చేశాడు. ఇది కాస్తా వైరల్గా మారింది. ఆస్పత్రిలో కూడా కరోనా పేషంట్లను పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.