ఏటీఎం కార్డుల దొంగ అరెస్టు

by Shyam |
ఏటీఎం కార్డుల దొంగ అరెస్టు
X

దిశ, ఆందోల్: అమాయక ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఏటీఎం కార్డు దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి నగదుతో పాటు ఓ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం….. చేగుంట మండలం మాసాని పేట గ్రామానికి చెందిన మహాత్మా రావు కొంత కాలంగా సంగారెడ్డిలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం సంగారెడ్డిలోని కరూర్ వైశ్య బ్యాంకు ఏటీఎం సెక్యూరిటీ గార్డుగా అతను పనిచేస్తున్నాడు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని ఏటీఎంల్లో డబ్బులు డ్రా చేయడం తెలియక ఇబ్బందులు పడే వారిని గుర్తించేవాడు. సహాయం చేస్తానని చెప్పి వారి దగ్గర నుంచి అతను ఏటీఎం కార్డులను తీసుకునేవాడు. ఆ తర్వాత ఆ కార్డుకు బదులుగా ఇతరుల కార్డులను వారికి ఇచ్చేవాడు. అనంతరం ఆ కార్డులతో వేరే ప్రాంతాలకు వెళ్లి ఏటీఎంల్లో డబ్బులను అతను డ్రా చేసేవాడు. అయితే అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితున్ని చాకచక్యంగా పట్టుకున్నారు.

Advertisement

Next Story