ఏటీఎం చోరీల దొంగలు అరెస్ట్..!

by  |
ఏటీఎం చోరీల దొంగలు అరెస్ట్..!
X

దిశ, పటాన్‌చెరు: ఏటీఎంలను టార్గెట్ చేసుకుని, గ్యాస్ కట్టర్ల సహాయంతో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురం పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ ఖలీల్, వందనపురి కాలనీకి చెందిన ఎరుకల మహేష్‎లు ఐదు ఏటీఎంల్లో దొంగతనాలకు యత్నించారు. రుద్రారంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో శనివారం తెల్లవారుజామున చోరీకి యత్నిస్తుండగా ఎస్ఐ రామానాయుడు నిందితులను రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు. నిందితుల నుంచి ఒక బైక్, గ్యాస్ సిలిండర్లు, కట్టర్‎తో పాటు పనిముట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.


Next Story