వందశాతం లక్ష్యాలు నెరవేర్చాలి

by  |
వందశాతం లక్ష్యాలు నెరవేర్చాలి
X

దిశ, భువనగిరి: హరితహారం లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయాలని యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ సూచించారు. మంగళవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ… మున్సిపాలిటీ పరిధిలోని పబ్లిక్ టాయిలెట్స్ నిర్మానాలను వెంటనే పూర్తి చేయాలన్నారు.

మున్సిపాలిటీలోని స్ట్రీట్ వెండర్స్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె సూచించా రు. కొత్తగా నిర్మించిన నాలుగు పబ్లిక్ టాయిలెట్స్‌ను వెంటనే ప్రారంభించాలని తెలిపారు. యాదాద్రి ప్లాంటేషన్ కొత్తగా గుర్తించిన బ్లాక్‌లలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన స్ట్రీట్ వెండర్స్ అందరికీ బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం ఈవీఎం గోదాంలను పరిశీలించారు.


Next Story

Most Viewed