ఫలక్‌నుమాలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

by  |
ఫలక్‌నుమాలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెట్టింగ్‌ బాబులు తెగ సంబుర పడిపోతున్నారు. ఆరంభ మ్యాచ్ నుంచే బెట్టింగ్‌లు మొదలెట్టారు. రోజూ లక్షల్లో డబ్బులు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్‌లు చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ బెట్టింగ్ ముఠాను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ ఫలక్‌నుమా చోటుచేసుకుంది. అలీనగర్‌లోని ఫేమస్ స్పేర్‌పార్ట్స్ షాపులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిర్వాహకులు సత్తార్, హాసన్‌లను అరెస్ట్ చేశారు. అనంతరం వారి నుంచి రూ.40 వేలు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.


Next Story

Most Viewed