రేషన్ కార్డులే ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లు

by Anukaran |
రేషన్ కార్డులే ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులను ఆదాయ ధ్రువీకరణ పత్రాలుగా చేర్చుతూ ప్రభుత్వ, ప్రైవేట్ కొర్పొరేషన్‌లు, సంస్థలకు ఏపీ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బీపీఎల్‌ స్థాయిని దాటిన కుటుంబాలకు ఆదాయ ధృవీకరణ పత్రం నాలుగేళ్లు చెల్లుబాటు కానుంది.

ప్రభుత్వ నిర్ణయంతో ఏపీలో రేషన్ కార్డులు ఇన్‌కమ్ సర్టిఫీకెట్‌గా చలమణిలోకి రానుంది. అటు రైతులకు రుణాలు మంజూరు చేసే విషయంలో కూడా రేషన్ కార్డునే ఇన్‌కమ్ సర్టిఫికేట్‌గా గుర్తించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు ముఖ్యంగా ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ కార్పొరేషన్‌లు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు పాటించాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వుల్లో వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed