ఏపీ సాయం చేయడం లేదు: ఒడిశా ఎంపీ

by srinivas |
ఏపీ సాయం చేయడం లేదు: ఒడిశా ఎంపీ
X

కరోనా వ్యాప్తి నివారణకు విధించిన లాక్ డౌన్ ఏపీలోని ఒడిశా వలస కూలీల పాలిట శాపంగా మారిందని ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీ అమర్ పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశాకు చెందిన 30 మంది వలస కూలీలు నెల్లూరులో చిక్కుకుపోయారని ఆయన తెలిపారు. నెల్లూరులో కరోనా కోరలు చాచిన నేపథ్యంలో వారిని ఆదుకోవాలంటూ ఏపీ సీఎస్ నీలం సాహ్నికి లేఖ రాసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారంతా ఒడిశాకు కాలినడకన రావడం మినహా మరే గత్యంతరం లేదని, అందుకే వారు నడుచుకుంటూ బయల్దేరారని ఆయన ఆయన తెలిపారు.

Tags: odisha mp, bjd mp, amar patnaik, ap, cs neelam sahni



Next Story

Most Viewed