మంత్రి పెద్దిరెడ్డికి పాజిటివ్

by  |
మంత్రి పెద్దిరెడ్డికి పాజిటివ్
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. కొద్ది రోజుల క్రితం మంత్రి బాలినేనికి కరోనా వచ్చింది. అపోలో చికిత్స తీసుకున్న తర్వాత బాలినేని డిశ్చార్జ్ అయ్యారు.

వైసీపీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు వైరస్ బారిన పడి కోలుకున్నారు. ఈ జాబితాలో విజయసాయిరెడ్డి, అంజాద్ భాషా, డిప్యూటీ స్పీకర్ రఘుపతి తదితరులున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసులు లక్షకు చేరువయ్యాయి. రోజూ పదివేల వరకూ కొత్త కేసులు వెలుగు చూస్తుండటంతో ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం 13 జిల్లాల్లో కలిపి 99,129 మంది కొవిడ్‌కు చికిత్స పొందుతున్నారు.



Next Story

Most Viewed