అందులో కుట్ర కోణం దాగి ఉంది – హోంమంత్రి

by  |
అందులో కుట్ర కోణం దాగి ఉంది – హోంమంత్రి
X

దిశ, ఏపీ బ్యూరో : దేశంలోనే తొలిసారిగా పోలీసులకు వారాంతపు సెలవులిచ్చింది ఏపీ ప్రభుత్వమేనని హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా పోలీస్ పాసింగ్ పెరేడ్‌లో సుచరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్‌పై సమరంలో పోలీసులు కీలకంగా పనిచేసినట్లు తెలిపారు.

వారి కోసం హెల్త్ క్యాంప్‌లు పెడుతున్నామని, అమరులైన పోలీసు కుటుంబాలకు 50 లక్షల బీమా వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ పోలీసులు దేశ వ్యాప్తంగా మన్ననలు పొందుతున్నారని చెప్పారు. ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనపై ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ వేసిందని, త్వరలో నిజాలు నిగ్గు తేలుస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు.

రథం తగలపడడం వెనుక కుట్ర కోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలు చూస్తుంటే.. ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయన్నారు. ఏది ఏమైనా సీబీఐ ఎంక్వైరీలో అన్నీ తేలుతాయని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంతర్వేది ఘటనపై సీరియస్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు.


Next Story

Most Viewed