అంతర్రాష్ట​ బస్సు సర్వీసులకు ఏపీ గ్రీన్ సిగ్నల్

by  |
అంతర్రాష్ట​ బస్సు సర్వీసులకు ఏపీ గ్రీన్ సిగ్నల్
X

దిశ, ఏపీ బ్యూరో: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెల 17 నుంచి కర్ణాటకలోని బెంగళూరు సహా పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడపాలని ఏపీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది.

తొలుత పరిమిత సంఖ్యలో 168 బస్సులను నడపనున్నట్టు వెల్లడించింది. అనంతరం నాలుగు దశల్లో మొత్తం 500 సర్వీసులకు పెంచనుంది. ఈ క్రమంలో జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి కర్ణాటకకు బస్సులు నడపేందుకు ఏర్పాట్లు చేయనున్నట్టు ఆర్టీసీ పేర్కొంది.

సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల రిజర్వేషన్లను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. apsrtconline.in ద్వారా రిజర్వేషన్ చేసుకోవాలని సూచించింది. అయితే, కరోనా నియంత్రణకు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధలు తప్పనిసరిగా పాటించాలని వివరించింది.


Next Story

Most Viewed