‘వైసీపీ గుండాలను అడ్డుకోండి డీజీపీ’

by  |
‘వైసీపీ గుండాలను అడ్డుకోండి డీజీపీ’
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇటీవల ఏపీలో పలువురు పోలీసులు చేసిన దాడుల ఘటనలను లేవనెత్తుతున్న టీడీపీ నేతలు అటు ప్రభుత్వంపైన కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ హోంమంత్రి చిన్నరాజప్ప డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఓ లేఖ రాశారు.

పోలీసుల తీరును వివరిస్తూ లేఖ రాసిన చినరాజప్ప… టీడీపీ కార్యకర్తలను కట్టడి చేస్తున్న పోలీసులు.. అదే విధంగా వైసీపీ గూండాలకు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. వైసీపీ నేత కృష్ణమూర్తి కారణంగా ఓ దళిత యువకుడిని పోలీస్ స్టేషన్‌లోనే శిరోముండనం చేశారన్నారు. మరీ ఆ వైసీపీ నేతపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేకు చెందిన ఓషెడ్డులో బయటపడ్డ గుట్కా తయారీ వ్యవహారం, జడ్జీని కించపరుస్తూ పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. విక్రమ్ హత్యకు ప్రేరేపించిన గురజాల ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోలేదని చిన రాజప్ప లేఖలో పేర్కొన్నారు.


Next Story

Most Viewed