కరోనాతో ఒక్కరు కూడా మృతిచెందకుండా చూడాలి..

by  |
కరోనాతో ఒక్కరు కూడా మృతిచెందకుండా చూడాలి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా కడప రిమ్స్ ఆసుపత్రిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.

ఈ క్రమంలో కరోనా బాధితుల సమస్యలపై ఆయన ఆరా తీశారు. అంతేగాకుండా వైరస్ బారిన పడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. కరోనాతో ఏ ఒక్కరూ మృతిచెందకుండా అధికారులు అందరూ కృషి చేయాలని కోరారు. అంతేగాకుండా కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు.



Next Story