ఏపీ సీఎస్ పదవీకాలం పొడిగింపు

by  |
ఏపీ సీఎస్ పదవీకాలం పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సాహ్ని సెప్టెంబర్‌ 30న పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆమె పదవీకాలాన్ని డిసెంబర్ 31వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమె జూన్ 30నే రిటైర్ అయినప్పటికీ ప్రభుత్వం ఆమె పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే కేంద్రం మాత్రం మూడు నెలలు మాత్రమే పొడిగించింది. కరోనా నేపథ్యంలో తాజాగా మరోసారి మూడు నెలలు పెంచాలని జగన్ సర్కార్ కోరగా కేంద్రం అనుమతిచ్చింది.


Next Story