ఎంపీలకు సీఎం జగన్ దిశానిర్దేశం

by  |
ఎంపీలకు సీఎం జగన్ దిశానిర్దేశం
X

దిశ, ఏపీ బ్యూరో: నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారాంభమౌతున్న సందర్బంగా వైసీపీ ఎంపీలతో మధ్యాహ్నం 12.30కు సీఎం జగన్ వీడియో సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు తీసుకురావాలని సూచించే అవకాశముంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల సాధనపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో పాటు రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు నిధుల సాధన కోసం నిర్దేశిస్తారని సమాచారం. కేంద్రం నుంచి కరోనా సాయంపైనా ఎంపీలతో సీఎం చర్చించనున్నారు. పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యలను ప్రస్తావించి పరిష్కారం దిశగా ఒత్తిడి పెంచడంపై సీఎం జగన్‌ సూచనలు చేయనున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి


Next Story

Most Viewed