అయోధ్య పై మతపరంగా రెచ్చగొట్టొద్దు : భారత్

by  |
అయోధ్య పై మతపరంగా రెచ్చగొట్టొద్దు : భారత్
X

దిశ, వెబ్ డెస్క్: అయోధ్య రామ మందిరం నిర్మాణంపై “మతపరమైన వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టొద్దని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని” దాయాది పాకిస్తాన్‌కు భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ సూచించారు.

“సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశానికి.. అక్కడి మైనార్టీలుగా ఉన్న హిందువులు, ఇతరులకు మతహక్కులు కాలరాయడం కొత్తేమీ కాదు. కానీ అయోధ్య ఆలయంపై ఇక్కడి ముస్లిములను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చాలా విచారకరం” ఆయన పేర్కొన్నారు.


Next Story

Most Viewed