అంతర్వేది ఆలయ రథం దగ్ధం..

by  |
అంతర్వేది ఆలయ రథం దగ్ధం..
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో స్వామివారి రథానికి మంటలు అంటుకోవడంతో అది దగ్ధమైంది.

ఆ రథానికి సుమారు 62ఏళ్ల చరిత్ర ఉందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఎవరైనా దుండగులు తగలబెట్టారా లేక షార్ట్ సర్క్యూట్ జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా, రథం కాలిపోవడంపై ఆలయ సిబ్బంది పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.


Next Story

Most Viewed