డ్రగ్స్‌కు బానిసైన ఐదుగురు అరెస్ట్

by  |
డ్రగ్స్‌కు బానిసైన ఐదుగురు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు స్మగ్లర్ల ద్వారా అరకు నుంచి నిషేధిత హషీస్ ఆయిల్‌ తెప్పించుకొని సేవిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 5 గ్రాముల హాషీస్ ఆయిల్‌ను రూ. 1500 కోనుగోలు చేసినట్టు తేలింది. బోయిన్ పల్లి, మల్కాజ్ గిరి ఏరియాల్లో కొంతమంది వీరికి డ్రగ్స్ అమ్మినట్టు తెలుస్లోంది. పట్టుబడ్డ సమయంలో నిందితుల వద్ద 155 గ్రాములు నిషేధిత హషీస్ ఆయిల్ ఉంది. సాయి రెడ్డి, విక్రమ్ అనే ఇద్దరు వ్యక్తులు వీరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు నిందితులు పోలీసులకు తెలిపారు.


Next Story