పుట్టి మునక.. మరో మృతదేహం లభ్యం

by  |
పుట్టి మునక.. మరో మృతదేహం లభ్యం
X

దిశ, మహబూబ్ నగర్ : పుట్టి మునిగి గల్లంతైన మరో మహిళ మృతదేహం లభ్యమైంది. సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్ లోని కృష్ణా నదిలో పుట్టి మునిగి నలుగురు గలంతయ్యారు. వీరిలో బుధవారం ఇద్దరు మహిళల శవాలు జూరాల సమీపంలో లభ్యం అవ్వగా గురువారం మరో మహిళ మృతదేహం ప్రాజెక్టు గేట్ల వద్ద లభించింది. తేలిన మూడవ మృతదేహం (సుమలత) అని పోలీసులు గుర్తించారు. కాగా, సుమలత కూతురు రోజ శవం లభించాల్సి ఉంది. అయితే బాలిక మృతదేహం నదిలోనే ఉందా లేక గేట్ల నుండి దిగువకు వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ మృతదేహం కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.



Next Story

Most Viewed