యాదాద్రిలో దేవాదాయశాఖ కమిషనర్

by  |
యాదాద్రిలో దేవాదాయశాఖ కమిషనర్
X

దిశ నల్గొండ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా.. బుధవారం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఆలయాన్ని సందర్శించారు. యాదాద్రి కొండ కింద జరిగే స్వామివారి కల్యాణోత్సవ వేదికను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈవో గీతారెడ్డిని ఆదేశించారు. సుమారు 50 వేల మందికి పైగా భక్తులు ఈ కళ్యాణ వేడుకలకు హాజరు అవుతున్నందున తగిన భద్రతా చర్యలను తీసుకోవాలన్నారు.

tag: anil Kumar, visit, yadagirigutta


Next Story

Most Viewed