మైసమ్మ ఆలయ హుండీ లెక్కింపు..!

by  |
మైసమ్మ ఆలయ హుండీ లెక్కింపు..!
X

దిశ, మునుగోడు:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని ఆందోల్ మైసమ్మ ఆలయం హుండీని లెక్కించారు. సోమవారం ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిట్టెడి వెంకటరెడ్డి, దేవాదాయ పరిశీలకురాలు సుమతి ఆధ్వర్యంలో లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీజీవీబీ బ్రాంచ్ మేనేజర్ విజయలక్ష్మీ, గ్రామ ఉపసర్పంచ్, తదితరులు పాల్గొన్నారు. ఆలయ పరిశీలకురాలు సుమతి తెలిపిన వివరాల ప్రకారం.. 95 రోజుల గానూ హుండీ ఆదాయం రూ. 6,31,030/-వచ్చినట్లు వెల్లడించారు.


Next Story

Most Viewed