గాలి బుడగలా ఎగురుతూ, ఇష్టానుసారం మాట్లాడుతున్నావే చెల్లెమ్మా!: పురంధేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి

by Seetharam |
గాలి బుడగలా ఎగురుతూ, ఇష్టానుసారం మాట్లాడుతున్నావే చెల్లెమ్మా!: పురంధేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఏపీలో మద్యం కుంభకోణం జరగుతుందని ఆ కుంభకోణంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉందని పురంధేశ్వరి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి విజయసాయిరెడ్డి బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అటు సోషల్ మీడియా, మీడియాల వేదికగా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బుధవారం మరోసారి పురంధేశ్వరిని విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు. టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ ఆరోపించారు.‘సంస్థాగతంగా బీజేపీని (అంటే తమరున్న పార్టీని) ఫణంగా పెట్టి మీ సామాజికవర్గ కుటుంబ పార్టీ అయిన టీడీపీ బలోపేతం కోసం తపిస్తున్నావని ఢిల్లీ పెద్దలకూ తెలుసులేమ్మా పురంధేశ్వరి’ అని సంచలన ఆరోపణలు చేశారు. ‘ఇసుకను గతంలో దోచుకునేవారు. ఇప్పుడు సహజవనరుల దోపిడీ తగ్గి ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తోందని తెలుసుకోమ్మా. గాలి బుడగలా ఎగురుతూ, ఇష్టానుసారం మాట్లాడుతున్నావే చెల్లెమ్మా!’అంటూ విజయసాయిరెడ్డి ఘాటుగా ట్వీట్ చేశారు.

Advertisement

Next Story