- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?

దిశ,వెబ్డెస్క్: విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరంలో 25 శాతం ఉచిత ప్రవేశాలకు షెడ్యూల్ వచ్చింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో 25శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తులు ఈ నెల(ఏప్రిల్) 28 నుంచి ప్రారంభం కానున్నాయని సమగ్రశిక్ష డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ప్రకటించారు. అన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలు ఆన్లైన్ పోర్టల్లో ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు నమోదు చేయాలని ఆదేశించారు.
ఉచిత ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తుకు చిరునామా ధ్రువీకరణ పేరెంట్స్ ఆధార్ కార్డ్స్, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు అవసరం ఉంటుంది. విద్యార్థుల వయసు 01–06–2025 నాటికి ఐదేళ్లు నిండి ఉండాలి. అధికారిక వెబ్సైట్ https://cse.ap.gov.in/ద్వారా అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత గ్రామ సచివాలయం, మండల విద్యావనరుల కేంద్రం, సంబంధిత పాఠశాల నుంచి వచ్చే నెల(మే) 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ విషయం పై సందేహాలు ఉంటే జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే టోల్ఫ్రీ నెంబర్ 18004258599ను ఏర్పాటు చేశారు.