- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి సమయం ఎంతంటే?

దిశ,వెబ్డెస్క్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు.
ఈ తరుణంలో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొన్ని సార్లు సాధారణంగా లేదా అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు(సోమవారం) తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఈ క్రమంలో కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం(ఉదయం 7గంటల నుంచి) డైరెక్ట్ లైన్ ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న(ఆదివారం) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 78,177మంది భక్తులు దర్శించుకున్నారు. 23,694మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.53 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు.